ఐపీఎస్ అధికారిణి భావనా సక్సేనా ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్గా కొనసాగుతున్న అభయ్ త్రిపాఠీ జూలై 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో భావనా సక్సేనాకు ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా కూడా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ