ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఏప్రిల్ 7, గురువారం) పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఏప్రిల్ 7వ తేదీన వారికీ సత్కార కార్యక్రమం నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు నరసరావుపేటలో జరిగే వాలంటీర్లను సత్కార కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని, వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర వంటి పురస్కారాలను అందించనున్నారు
ఈ పర్యటనలో భాగంగా ముందుగా గురువారం ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయలుదేరి నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ గ్రౌండ్స్కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి పీఎన్సీ కాలేజీ వద్దకు చేరుకొని కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత అదే వేదికపై సీఎం వైఎస్ జగన్ వాలంటీర్లను సత్కరించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ