దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు, తన కుటుంబసభ్యులకు కరోనా సోకిందని పోసాని కృష్ణమురళి స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం గచ్చిబౌళి ఏఐజీ ఆసుపత్రిలో పోసాని చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను క్షమించాలని పోసాని కోరారు. తన వలన రెండు సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశముందని, అందుకు బాధగా ఉందన్నారు. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ, అందరి ఆశీస్సులతో కోలుకొని త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటానని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ