తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 249 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో సెప్టెంబర్ 12, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,61,551 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 313 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 6,52,398 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.61 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3895కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,258 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 82, నల్గొండలో 18, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 17, వరంగల్ అర్బన్ లో 14, రంగారెడ్డిలో 13, ఖమ్మంలో 12, కరీంనగర్ లో 11 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ