కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. ఒంట్లో కొద్దిగా నలతగా ఉండటంతో పరీక్ష చేసుకోగా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అయితే వెంటనే వైద్యులను సంప్రదించి ఐసొలేషన్ లోకి వెళ్లానని వెల్లడించారు. కోవిడ్-19 కారణంగా కొంచెం జ్వరంగా ఉందని, అంతకుమించి ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఇటీవల తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
అయితే సోనియా గాంధీ గత వారం రోజులుగా పార్టీ నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ కీలక నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా దీనిపై స్పందిస్తూ అన్నారు. ఆమెను కలిసిన వారిలో కొందరికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని కూడా ఆయన వెల్లడించారు. అయితే నిన్న సాయంత్రం సోనియా గాంధీకి తేలికపాటి జ్వరం వచ్చిందని, వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు ఆమె మెడిసిన్ తీసుకుంటున్నారని అని ఆయన చెప్పారు. కాగా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాహుల్, సోనియా గాంధీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి జూన్ 8న ఆమె దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF