దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. వరుసగా రెండో రోజు కూడా 20 వేలకంటే తక్కువుగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 18,833 కరోనా కేసులు నమోదవడంతో అక్టోబర్ 6, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,38,71,881 చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 278 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,49,538 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, మిజోరాం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి.
దేశంలో 2,46,687 యాక్టీవ్ కరోనా కేసులు, గత 203 రోజుల్లో ఇదే తక్కువ:
దేశంలో ప్రస్తుతం 2,46,687 (0.73%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. యాక్టీవ్ కేసులు గత 203 రోజుల్లో కనిష్టానికి చేరుకున్నాయి. కొత్తగా 24,770 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 3,31,75,656 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 97.94 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.33 శాతంగా ఉంది. ఇక అక్టోబర్ 5, మంగళవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 57,68,03,867 కు చేరుకుంది. అక్టోబర్ 5న 14,09,825 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ