దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ముందుగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచమంతగా విస్తరించింది. కాగా భారత్ లో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2135కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించింది. మొత్తం 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవగా, అత్యధికంగా మహారాష్ట్రలో 653, ఢిల్లీలో 464 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కాగా మొత్తం 2135 బాధితుల్లో ఇప్పటికే 828 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు.
దేశంలో ఒమిక్రాన్ కేసుల వివరాలు (2135):
- మహారాష్ట్ర – 653
- ఢిల్లీ – 464
- కేరళ – 185
- రాజస్థాన్ – 174
- గుజరాత్ – 154
- తమిళనాడు – 121
- తెలంగాణ – 84
- కర్ణాటక – 77
- హర్యానా – 71
- ఒడిశా – 37
- ఉత్తర్ ప్రదేశ్ – 31
- ఆంధ్రప్రదేశ్ – 24
- వెస్ట్ బెంగాల్ – 20
- మధ్యప్రదేశ్ – 9
- ఉత్తరాఖండ్ – 8
- గోవా – 5
- మేఘాలయ – 5
- చండీఘర్ – 3
- జమ్మూ కాశ్మీర్ – 3
- అండమాన్ అండ్ నికోబార్ – 2
- పంజాబ్ – 2
- హిమాచల్ ప్రదేశ్ – 1
- లద్దాఖ్ – 1
- మణిపూర్ – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ