దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 58,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 05, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,50,18,358 చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 534 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,82,551కి పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
దేశంలో మళ్ళీ 2 లక్షలు దాటిన యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.01 శాతం:
దేశంలో యాక్టీవ్ కరోనా కేసుల సంఖ్య మళ్ళీ 2 లక్షలు (2,14,004) దాటింది. ఇక కొత్తగా 15,389 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 3,43,21,803 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 98.01 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.38 శాతంగా ఉంది. అలాగే జనవరి 04, మంగళవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 68,38,17,242 కు చేరుకుంది. జనవరి 04న 13,88,647 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ