ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కొత్తగా 13,819 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 25, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,08,955 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో 1988, ప్రకాశంలో 1589, గుంటూరులో 1422, అనంతపూర్ లో 1345, నెల్లూరులో 1305, కర్నూల్ లో 1255, కడపలో 1083, తూర్పుగోదావరిలో 1001 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 5716 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 12 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 14561కీ పెరిగింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జనవరి 25, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య : 3,22,34,226
- గత 24 గంటల్లో (9AM-9AM) నిర్వహించిన కరోనా పరీక్షలు : 46,929
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 22,08,955
- కొత్తగా నమోదైన కేసులు : 13,819
- కొత్తగా నమోదైన మరణాలు : 12
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 20,92,998
- యాక్టీవ్ కేసులు : 1,01,396
- మొత్తం మరణాల సంఖ్య : 14,561
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF