ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 2022, సెప్టెంబర్ 30న 92 గ్రూప్-1 పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ముందుగా నోటిఫికేషన్ లో ప్రకటించిన విధంగా ఈ గ్రూప్-1 పోస్టుల కోసం ఆన్లైన్ లో అక్టోబర్ 13 నుంచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభం కాగా, నవంబర్ 2వ తేదీతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. అయితే గ్రూప్-1 పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే గడువును నవంబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
“నిరుద్యోగ యువత నుండి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న కమిషన్, ఈ పరిస్థితులలో గ్రూప్-1 సర్వీసుల కింద వచ్చే పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని నవంబర్ 2 నుండి నవంబర్ 5 వ తేదికి పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఫీజు చెల్లించడానికి నవంబర్ 4 (అర్ధరాత్రి 11:59 వరకు) చివరి తేదీగా నిర్ణయించబడింది” అని ఏపీపీఎస్సీ పేర్కొంది. ఇక పరీక్షల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ నెం.28/2022లో పేర్కొన్న అన్ని ఇతర తేదీలు అనగా 2022, డిసెంబర్ 18న స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ) మరియు రాత పరీక్ష (మెయిన్స్) 2023, మార్చి సెకండ్ హాఫ్ లో జరుగుతుందని, వీటిల్లో ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.in ద్వారా ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE