మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు టీమిండియా బుధవారం వెస్టిండీస్తో రెండో మ్యాచ్ ఆడటానికి సిద్ధమైంది. సిరీస్పై కన్నేసిన భారత్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మొదటి వన్డేలో అద్భుత విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న టీమిండియా ఈ వన్డేలో కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. దీంతో.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకోవడంపై దృష్టి పెట్టింది. లోకేష్ రాహుల్ కూడా జట్టులో చేరటం మరింత బలాన్నిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లో ఉండటం భారత్ కు అనుకూలించే విషయం. ఇక బౌలింగ్ లో స్పిన్ ద్వయం చాహల్, సుందర్ మొదటి వన్డేలో విండీస్ వెన్ను విరవటంలో కీలక పాత్ర పోషించారు.
స్వతహాగా ఇది బ్యాటింగ్ పిచ్ అయినా కొంతమేరకు స్పిన్నర్లకు కూడా సహకరించే అవకాశం ఉందని క్యూరేటర్ చెప్పాడు. మరోవైపు భారీ హిట్టర్లున్న విండీస్ మొదటి వన్డేలో తమ స్థాయికి తగ్గప్రదర్శన చేయలేదు. ఇంగ్లాండ్ పై సిరీస్ గెలుచుకుని ఫుల్ జోష్ లో భారత్ లో అడుగుపెట్టిన వెస్టిండీస్ కి టీమిండియా గట్టి షాక్ ఇచ్చింది. బ్యాట్సమెన్ వైఫల్యం ఆ జట్టులో కొంత ఆందోళన కలిగిస్తోంది. భారత్ బ్యాట్సమెన్ ముందు విండీస్ బౌలర్లు కూడా తేలిపోయారు. ఈ క్రమంలో విండీస్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో రాణిస్తేనే ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ సమం చేయతనిఖీ అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రసారం కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ