తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే వీటీజీసెట్-2022 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) దరఖాస్తు గడువును పొడిగించారు. గతంలో ఈ ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 7, 2022గా నిర్ణయించగా, తాజాగా గడువును ఏప్రిల్ 14, 2022వ తేదీ వరకు పొడిగిస్తునట్టు ప్రకటించారు. ఈ మేరకు వీటీజీసెట్ చీఫ్ కన్వీనర్ రోనాల్డ్ రోస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఈ ప్రవేశ పరీక్ష మే 8వ తేదీ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన కేంద్రాలలో నిర్వహించబడుతుందని తెలిపారు.
2022-2023 విద్యా సంవత్సరానికి గానూ సోషల్, ట్రైబల్, బీసీ మరియు జనరల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం వీటీజీసెట్-2022 నిర్వహించనున్నారు. ప్రవేశానికి సంబంధించిన ప్రశ్నలు, సందేశాల నివృత్తి కోసం అభ్యర్థులు టోల్ఫ్రీ నంబర్ 1800 425 45678 ను సంప్రదించవచ్చని చెప్పారు. అలాగే అభ్యర్థులు ప్రాస్పెక్టస్, అర్హత ప్రమాణాలు మరియు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ కోసం www.tswreis.in, http:/tgcet.cgg.gov.in, http:/mjptbcwreis.telangana.gov.in, http:/tgtwgurukulam.telangana.gov.in, http:/tresidential.gov.in వంటి వెబ్సైట్లను సందర్శించాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ