ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు నారాయణ బెయిల్ వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆయనకు బెయిల్ రావడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నారాయణ బెయిలు రద్దుపై త్వరలోనే హైకోర్టుకు వెళ్తామని ప్రకటించారు. ఈ అంశంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పడవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు దొరకడం వలనే నారాయణను పోలీసులు అరెస్టు చేశారని స్పష్టం చేశారు. నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ గిరిధర్ పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో నారాయణ ప్రోద్భలంతోనే తాము దీన్ని అమలు చేశామని వెల్లడించాడని గుర్తు చేశారు.
ఈ కేసులో నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసిన అనేకమంది హస్తం ఉందని, దీనికి బాధ్యుడైన నారాయణను అరెస్ట్ చేయడంలో ఎలాంటి రాజకీయం లేదని తెలిపారు. కానీ టీడీపీ నేతలు దీనిని రాజకీయానికి వాడుకుంటున్నారని, నారాయణ అరెస్టుపై చంద్రబాబు స్పందించిన తీరు అభ్యంతరకరమని పేర్కొన్నారు. పరీక్షలలో మాల్ ప్రాక్టీసు వంటి వాటి వలన విద్యార్థుల భవిష్యత్తుకి తీరని నష్టం వాటిల్లుతుందని, రాష్ట్రంలో మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అందుకే నారాయణ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ