ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణకు మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ను దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు నారాయణకు నోటీసులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, ఈ నెల 24న ఈ కేసుపై వాదనలు విననున్నట్లు కోర్టు తెలిపింది. జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్లో.. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా పత్రాలను లీక్ చేయడంలో నారాయణ ప్రధాన నిందితుడుగా ఉన్నాడని, కావున ఆయన బెయిల్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
“బెయిల్ పిటిషన్ వేయకుండానే బెయిల్ మంజూరు చేయబడింది. చట్టం ముందు అందరూ సమానులే” అని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఆయన వాదనతో ఏకీభవించిన కోర్టు.. నారాయణకు బెయిల్ మంజూరు చేయడంపై నోటీసులు జారీ చేసింది. కాగా ఏపీలో 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసులో నారాయణను మే 10వ తేదీన పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి చిత్తూరుకు తీసుకొచ్చారు. ఆరోజు రాత్రి ఆయనకు వైద్య పరీక్షురాలు నిర్వహించారు. మే 11వ తేదీన చిత్తూరు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, టీడీపీ నేతకు బెయిల్ మంజూరు చేశారు. అయితే పరీక్ష పేపర్ల లీక్ కేసులో రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 60 మందికి పైగా అరెస్ట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ