పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈరోజు ఖమ్మం పట్టణంలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన గాయపడ్డారు. బుధవారం ఉదయం పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్పై వెళ్తున్న రామయ్యను ఒకచోట రోడ్డు దాటే క్రమంలో మరో బైక్ ఢీకొట్టింది. అయితే ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆయనను 108 అంబులెన్సులో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన తలకు గాయాలయ్యాయని, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
విషయం తెలిసిన పట్టణ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని, వివరాలు సేకరిస్తున్నారు. రామయ్య కుటుంబసభ్యులకు ప్రమాదం గురించి సమాచారం అందించారు. మొక్కల పెంపకం అంటే రామయ్యకు ప్రాణం, తనకు ఎదురుపడిన వారందరికీ దీనిపై అవగాహన కల్పిస్తూంటారు వనజీవి రామయ్య. పర్యావరణం కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. కాగా ప్రమాదం గురించి తెలుసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ రామయ్య ఆరోగ్యంపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి రామయ్య ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు. ఆయనకు ఎలాంటి వైద్య సహాయం కావాలన్నా వెంటనే ఏర్పాట్లు చేయవలసిందిగా ఆస్పత్రి వైద్యులకు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ