కెప్టెన్ అభిలాష బరాక్ భారత సైన్యం యొక్క మొదటి మహిళా ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో ఫైటర్ ఏవియేటర్గా చేరి చరిత్ర సృష్టించారు. నాసిక్లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్మీ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ ఆమెకు గౌరవనీయమైన ‘బాడ్జెట్’ ప్రదానం చేశారు. యుద్ధ ఆర్మీ ఏవియేషన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, కెప్టెన్ అభిలాష ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో పోరాట పైలట్గా చేరిన మొదటి మహిళా అధికారిగా గుర్తింపు పొందారు. ఆమె సెప్టెంబరు 2018లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్ప్స్లో నియమించబడింది.
అభిలాష, హర్యానాకు చెందిన రిటైర్డ్ కల్నల్ ఎస్ ఓం సింగ్ కుమార్తె. నవంబర్ 1986లో ఆర్మీలో భాగంగా స్థాపించబడిన ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో చేరడానికి ముందు కెప్టెన్ అభిలాష వివిధ రకాల ప్రొఫెషనల్ మిలటరీ కోర్సులను పూర్తి చేసింది. ఈ క్రమంలోనే పురుషులతో పోటీ పడుతూ 36 మంది ఆర్మీ పైలట్ల్లో ఒకరిగా అభిలాష నిలవడం విశేషం. అంతకుముందు, 2018లో, భారత వైమానిక దళానికి చెందిన ఫ్లయింగ్ ఆఫీసర్ అవనీ చతుర్వేది యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. చతుర్వేది జూలై 2016లో ఫ్లయింగ్ ఆఫీసర్గా నియమితులయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ