హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవం స్నాతకోత్సవంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఐఎస్బీ హైదరాబాద్ క్యాంపస్ను సందర్శించిన ప్రధానమంత్రి క్లాస్లో టాపర్లకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. అనంతరం హైదరాబాద్లో జరిగిన ఐఎస్బీ 20వ వార్షికోత్సవం స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మొహాలీ మరియు హైదరాబాద్ క్యాంపస్ల నుండి మొత్తం 930 మంది విద్యార్థులు హాజరయ్యారు. 20వ వార్షికోత్సవం సందర్భంగా ముందుగా మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశం కూడా 75 ఏళ్ల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను జరుపుకుంటున్నందున ఈ సంస్థ చాలా ప్రత్యేకమైన సమయంలో మైలురాయిని సాధించిందని అన్నారు. ఆసియాలోనే మొదటి స్థానంలో ఐఎస్బీ, దేశానికే ఇది గర్వకారణమని పేర్కొన్నారు. ఐఎస్బీ నుండి ఉత్తీర్ణులైన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో గొప్ప గొప్ప స్థానాల్లో పనిచేస్తున్నారని గుర్తుచేశారు. అలాగే దేశీయంగా వ్యాపారాలకు తమ సహకారాన్ని అందించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడ్డారని పేర్కొన్నారు.
రిఫార్మ్, పెర్ఫర్మ్, ట్రాన్సఫార్మ్ లక్ష్యాలుగా యువత ముందుకు సాగాలి అని ప్రధాని మోదీ సూచించారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ ఇండియాలో ఉంది. ఇంటర్నెట్ వాడకంలో 2వ స్థానంలో ఉంది. అలాగే యువతలో ప్రధమ స్థానంలో ఉందని తెలిపారు. యువతతో పనిచేసేందుకు ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని, ప్రపంచాన్నే నడిపించగల యువత భారత్ సొంతం అని ప్రశంసించారు. ప్రపంచంలో అత్యధిక డిజిటల్ లావాదేవీలు ఇండియాలోనే జరుగుతున్నాయని, దేశంలో కొత్త కొత్త ఆవిష్కరణలకు యువత ముందుకు రావాలని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ