తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు బెంగళూరు పర్యటనకు వెళ్లారు. గురువారం మధ్యాహ్నం బెంగళూరుకు చేరుకున్న సీఎం కేసీఆర్ కు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెఛ్.డీ కుమారస్వామి, పలువురు నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బెంగళూరులోని పద్మనాభనగర్లో గల జనతాదళ్ (సెక్యూలర్) జాతీయ అధ్యక్షుడు, మాజీ భారత ప్రధాని దేవెగౌడ నివాసానికి చేరుకొని, ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కుమారస్వామి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు.
అనంతరం భేటీ సందర్భంగా దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, కేంద్రప్రభుత్వ విధానాలపై పోరు, ప్రత్యామ్నాయ ఎజెండా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం, దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, భవిష్యత్ కార్యాచరణ సహా పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఇక బెంగళూరు పర్యటన ముగించుకుని సాయంత్రం 4 గంటలకు నుంచి సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగుప్రయాణం కానున్నారు. జాతీయస్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే దిశగా చేపట్టే దేశవ్యాప్త పర్యటనల వివరాలను సీఎం కేసీఆర్ ఇటీవలే వెల్లడించారు. అందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ, చండీగఢ్ లలో సీఎం కేసీఆర్ పర్యటించగా, తాజాగా బెంగళూరు పర్యటన చేపట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF