భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. చాలా మందికి సహాయపడగలనని భావించేదాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నానని, తన జీవితంలో కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నానని ప్రకటించాడు. సౌరవ్ గంగూలీ ఆసక్తికర ట్వీట్ చేస్తూ “1992లో క్రికెట్తో నా ప్రయాణం ప్రారంభించి 2022కి 30 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి క్రికెట్ నాకు చాలా ఇచ్చింది. మరీ ముఖ్యంగా మీ అందరి మద్దతు నాకు లభించింది. ప్రయాణంలో భాగమైన, నాకు మద్దతునిచ్చిన మరియు ఈ రోజు నేను ఉన్న స్థితికి చేరుకోవడానికి నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు నేను చాలా మందికి సహాయపడగలనని భావించేదాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాను. నేను నా జీవితంలో ఈ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు మీ మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నాను” పేర్కొన్నాడు.
సౌరవ్ గంగూలీ తాజా ప్రకటనతో అతను బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తునట్టు వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందిస్తూ బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా చేయలేదని తెలిపారు. అలాగే గంగూలీ రాజకీయాల్లోకి రాబోతున్నారని, ఈ నేపథ్యంలోనే తాజా ప్రకటన చేసుండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాజ్యసభకు వెళ్తారా లేదా గంగూలీ నుంచి రాజకీయంగా మరేదైనా కీలక ప్రకటన ఉంటుందా?, ఇతర రంగాలకు సంబంధించిన విషయమా అనేది తేలాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF