తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 52 కేజీలు విభాగంలో స్వర్ణపతకం సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐ.ఎస్.ఎస్.ఎఫ్) జూనియర్ ప్రపంచకప్లో సికింద్రాబాద్ కు చెందిన యువ షూటర్ ఈషా సింగ్ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈమేరకు నిఖత్ జరీన్ కు, ఈషా సింగ్ లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్ల నగదు బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది. నగదు బహుమతితో పాటు వీరికి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF