మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 10, శుక్రవారం నాడు 3,081 కరోనా కేసులు, 0 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 79,04,709కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,47,867 గా ఉంది. ఇక కొత్తగా కరోనా నుంచి 1,323 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 77,43,513 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.96 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.87 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 13,329 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ముంబయిలో అత్యధికంగా 9191 యాక్టీవ్ కేసులు ఉండగా, థానేలో 2157, పుణేలో 884, రాయగడ్ లో 411, పాల్గర్ లో 314 కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి మహారాష్ట్రలో 8,12,37,544 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY