68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విన్నర్స్ కి మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ఆయన శుభాకాంక్షలు అందజేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా అనేక భాషలకి సంబంధించి ఉత్తమ చిత్రాలు, నటీనటులు అలాగే ఇతర కీలక క్యాటగిరీ లలో అవార్డులను ప్రకటించారు. ఈ క్రమంలో మన తెలుగు సహా తమిళ, మళయాళ భాషల్లోని పలు చిత్రాలు.. దర్శకులు, సంగీత దర్శకులు కూడా ఆయా కేటగిరీల్లో అవార్డులను దక్కించుకున్నారు.
Hearty Congratulations to ALL the National Award Winners from across India. Our very own #ColorPhoto team Team #Natyam , @Sudha_Kongara @gvprakash Team #SooraraiPottru
& Team #AyyappanumKoshiyum
among others!!#68thNationalFilmAwards— Chiranjeevi Konidela (@KChiruTweets) July 23, 2022
తమిళ ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘సూరారై పొట్రు’ సినిమా ఐదు అవార్డులను కైవసం చేసుకోగా, కలర్ ఫోటో ఉత్తమ తెలుగు చిత్రం అవార్డును గెలుచుకుంది. అలాగే ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి గాను ‘ఎస్ థమన్’ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఇక మరో తెలుగు చిత్రం ‘నాట్యం’ సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్గా సంధ్యారాజు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన విజేతలందరికీ మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ