వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల దృష్ట్యా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన నేపథ్యంలో పాదయాత్రకు ఆమె కొంత బ్రేక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర తిరిగి ఆగస్టు 8 నుంచి పునఃప్రారంభం కానుంది. కొండగల్ పట్టణంలో భారీ బహిరంగ సభ అనంతరం, అక్కడినుంచే వైఎస్ షర్మిల పాదయాత్రను మొదలుపెట్టనున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పాదయాత్ర వివరాలను వెల్లడించింది.
ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాదయాత్ర ముగించుకున్న వైఎస్ షర్మిల, ఇకపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకోనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలలో పాదయాత్ర కొనసాగించేలా కార్యాచరణను సిద్దం చేసినట్లు పాదయాత్ర కో-ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY