తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మూడో వారం నుంచి జరిగే అవకాశముంది. ఈ మేరకు బడ్జెట్ రూపకల్పన, ఇతర అంశాలపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 3, సోమవారం నుంచి పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పన కోసం అధికారులు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 1న 2020-21 సంవత్సరానికిగానూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన కేటాయింపులపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ కేయింపుల విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర, ఫిబ్రవరి 15న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలు జరగుతుండడంతో రాష్ట్ర మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే అందరికి అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
[subscribe]