తెలంగాణ కుంభమేళగా పేరొందిన శ్రీ సమ్మక్క – సారలమ్మల మహాజాతర ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటకులు మరియు భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలను రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంబించారు. బేగంపేట్ లోని పాత ఎయిర్ పోర్ట్ లో ఈ ప్రారంభ కార్యక్రమం జరిగింది. టూరిజం ప్యాకేజీ లో బాగంగా హెలికాఫ్టర్ సేవలను బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం, మేడారం నుండి బేగం పేట ఎయిర్ పోర్టు వరకు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు రూ.1లక్ష 80 వేలుతో పాటు జీఎస్టీ (1.80.000 + జీఎస్టీ) ఉంటుందన్నారు. వీటితో పాటు మేడారం జాతర వ్యూను హెలిక్యాప్టర్ నుండి చూసేందుకు ప్రతి ప్రయాణికుడికి రూ.2999 నామ మాత్రపు చార్జీ ఉంటుందని చెప్పారు. మేడారం శ్రీ సమ్మక్క – సారలమ్మల మహా జాతరకు వచ్చిన భక్తులకు మరియు పర్యాటకులకు హెలిక్యాప్టర్ లో విహరించే అద్బుత అవకాశంను తెలంగాణ పర్యాటక శాఖ కల్పించిందని మంత్రి పేర్కొన్నారు. పర్యాటకులు హెలిక్యాప్టర్ సదుపాయంను ఉపయోగించుకోవటానికి 94003 99999 పోన్ నెంబర్ ద్వారా సంప్రదించాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం ఛైర్మన్ భూపతి రెడ్డి, రాష్ట్ర పౌర విమానయాన శాఖ డైరెక్టర్ భరత్ రెడ్డి, టూరిజం ఎండీ మనోహర్ మరియు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
[subscribe]