శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 199వ పాఠంలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా, నిత్యామీనన్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన “బీమ్లా నాయక్” సినిమాపై విశ్లేషణ చేశారు. బీమ్లానాయక్ 2020లో వచ్చిన మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకి రీమేక్. బీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని, అయితే వన్ మ్యాన్ షో పండడానికి కారణం నటుడు రానా అని చెప్పారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, పవన్ కళ్యాణ్, రానా, ఇతర నటీనటుల ప్రతిభ మరియు సాగర్ కే చంద్ర దర్శకత్వ ప్రతిభ, ఒరిజినల్ వర్షన్ కి చేసిన మార్పులు గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇