మూడు రోజుల విరామం తర్వాత నారాయణపేట జిల్లా మక్తల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం నాడు తిరిగి ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్ మీదుగా బుధవారం అర్థరాత్రి మక్తల్ చేరుకున్న ఆయన, ఇతర పార్టీ నాయకులు మరియు వందలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి ఉదయం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ రాహుల్ గాంధీ యాత్రకు భారీ ఏర్పాట్లు చేసింది. రాహుల్ యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు మధుయాష్కీ గౌడ్, పొన్నాల ప్రభాకర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు పాల్గొన్నారు. కాగా నేటి యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కన్యకాపరమేశ్వరి దేవాలయం, పెద్ద చెరువు ట్యాంక్బండ్, దండు క్రాస్ రోడ్డుల మీదుగా కచ్వర్ గ్రామం చేరుకున్నారు.
అనంతరం జక్లేర్ క్రాస్ రోడ్డు మీదుగా గుడిగండ్ల గ్రామం క్రాస్ రోడ్డులో ఏర్పటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ రైతులను కలుసుకోనున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు రాహుల్ రైతులతో కొద్దిసేపు మాట్లాడనున్నారు. ఇక ఈరోజు రాత్రికి మరికల్లో బస చేయనున్నారు. ఇక పాదయాత్రలో రాహుల్గాంధీ పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్మికులు, నారాయణపేట జిల్లాకు చెందిన బీడీ కార్మికుల సమస్యలు తెలుసుకుంటూ యాత్ర కొనసాగించనున్నారు. శుక్రవారం గోప్లాపూర్కలాన్, దేవరకద్ర, ఓబ్లాయిపల్లె, ధర్మాపూర్, యెనుగొండ, జడ్చర్ల, మహబూబ్నగర్లలో పాదయాత్ర కొనసాగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY