మే 29, శుక్రవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామీ పాల్గొని ఆశీర్వచనం ఇస్తారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. మర్కూక్ పంప్ హౌస్ నుంచి ఈ కొండపోచమ్మ సాగర్ కు నీటిని లిఫ్ట్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు తో సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ కు కాళేశ్వరం నీరు చేరనున్నాయి. గజ్వేల్ తో పాటుగా పొరుగు నియోజకవర్గాలలో కూడా వేల ఎకరాలకు సాగునీరు సమకూరనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu