తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ అభిమానులు, కాసాని మద్దతుదారులు భారీగా హాజరయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు చేరుకునేముందు కాసాని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు కాసాని చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటి వరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులును చంద్రబాబు టీడీపీ పొలిట్బ్యూరోలోకి తీసుకుని ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిగా కాసానిని నియమించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE