ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని డిసెంబర్ 14వ తేదీన ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభానికి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ ఢిల్లీలో మంగళ, బుధవారాల్లో రాజశ్యామల యాగం నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 14 నుంచే బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ఈ క్రమంలో పార్టీ ముఖ్య నేతలంతా 13వ తేదీ సాయంత్రానికి ఢిల్లీ చేరుకోవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే సూచించారు.
ఆదివారం తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్కుమార్, పలువురు నేతలతో కలిసి ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాట్లను పరిశీలించారు. బీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటు కోసం లీజుకు తీసుకున్న భవనంలో మరమత్తులు, మార్పులు ఇప్పటికే పూర్తికాగా, పలు సూచనలు చేసి ప్రారంభానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసేలా సూచనలు చేశారు. కాగా మరి కొన్ని నెలల్లో న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ సొంత భవనం పూర్తికానుండగా, అనంతరం అక్కడి నుంచే పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE