ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. మాండూస్‌ తుపాను బాధితులకు రూ. 2,000 తక్షణ ఆర్థిక సాయం విడుదల

AP Govt Releases Immediate Financial Assistance of Rs 2000 For Cyclone Mandous Victims,Key Orders Of Ap Govt,Mandus Cyclone Victims,Rs 2000 Financial Assistance,Mango News,Mango News Telugu,Cyclone Mandus Approaching,Heavy Rains In Ap Districts,Heavy Rains In Ap,Mandus Cyclone,Mandus Cyclone Ap,Andhra Pradesh Heavy Rains,Heavy Rains In Ap,Ap Heavy Rains,Mango News,Mango News Telugu,Rain Prediction In Ap,Heavy Rains In Andhra,Imd Prediction Os Rains,Imd Ap,Ap Imd,India Metoroligical Department,Imd Latest News And Updates,Imd News And Live Updates,IMD Rains For Next 2 Months In AP, Andhra Pradesh IMD,India Metoroligical Department News and Updates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాండూస్‌ తుపాను కారణంగా గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. కాగా ఈ పునరావాస కేంద్రాల నుంచి వెళ్లే ముంపు బాధితులకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించనుంది. తుపాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలు.. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లోని బాధితులకు ఈ ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించింది. ఒక వ్యక్తికి రూ.1000, అలాగే కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మాండూస్ తుపాను నేపథ్యంలో సీఎం జగన్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో అప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావిత జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =