ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా మార్చి నెలలో రెండు ప్రతిష్టాత్మక సదస్సులు జరుగనున్నాయి. వీటిలో ప్రధానంగా జీ-20 వర్కింగ్ గ్రూప్ సన్నాహక సమావేశంతో పాటు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్-2023లు ఉన్నాయి. ఈ కార్యక్రమాల కోసం అధికారులు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు రాజన్న దొర, ముత్యాల నాయుడు, హోంమంత్రి తానేటి వనిత, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజినీ, సీఎస్ జవహర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.
వైజాగ్లో ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లపై సీఎం జగన్ కీలక ఆదేశాలు, సూచనలు..
- ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
- విశాఖ నగరాన్ని సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి.
- నగరంలోని ప్రధాన రోడ్లు, జంక్షన్లు సహా బీచ్ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలి.
- మార్చి 3, 4 తేదీల్లో ఏపీలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును నిర్వహించనున్న నేపథ్యంలో సన్నాహకాలు పకడ్బందీగా చేయాలి.
- రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగాలి.
- రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి ప్రత్యేక యాప్ ద్వారా తెలియజేయాలి.
- అలాగే మార్చి 28, 29 తేదీల్లో జీ-20కి సంబంధించిన మౌలిక వసతుల వర్కింగ్ మీటింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
- ఇక జీ-20 సదస్సుకు సభ్య దేశాల నుంచి దాదాపు 250 మంది అతిథులు రానున్నారు.
- ఒక్కో దేశం నుంచి 6గురు చొప్పున, అంతర్జాతీయ సంస్ధల తరపున మరో 4గురు పాల్గొననున్నారు.
- ఇంకా కేంద్రం నుంచి మరో 100 మంది అతిథులు రానున్నారు.
- ఈ సమావేశాలకు వచ్చే అతిథులకు ఆతిథ్యం, రవాణా వంటి ఏర్పాట్లు విషయంలో లోటు లేకుండా చూసుకోవాలి.
- అలాగే ఈ ఈ సమావేశాలకు వచ్చే ప్రతినిధులు నగరం పరిధిలోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లే సమయంలో తగిన ఏర్పాట్లు చేయాలి.
- ఆయా పర్యాటక ప్రదేశాల్లో ఆహ్లాదకర, పరిశుభ్రమైన వాతావరణం మరియు భద్రతా ఏర్పాట్లపై దృష్టి పెట్టాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE