ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో అప్పుడే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. పండుగ సెలవులను పురస్కరించుకుని రెండు రోజుల ముందుగానే గురువారం సచివాలయ ఉద్యోగులు ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. రంగవళ్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, కత్తిసాము ప్రదర్శనలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, మేరుగ నాగార్జునలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తమ ఆహ్వానం మేరకు సచివాలయానికి వచ్చిన మంత్రులకు ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులందరికీ భోగి, మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొనడం సంతోషాన్నిస్తోందని, సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వారు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE