గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది కరోనా కారణంగా అధికారికంగా వేడుకలు నిర్వహించకూడదని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా రాజ్భవన్లోనే గణతంత్ర వేడుకలను జరుపుకోవాలని గవర్నర్కు లేఖ ద్వారా ప్రభుత్వం సూచించింది. దీనిపై గవర్నర్ తీవ్ర తమిళిసై సౌందరరాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంపై హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారం జరిపిన హైకోర్టు రిపబ్లిక్ డే ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అలాగే ఈ వేడుకలకు ప్రజలను అనుమతించాలని కూడా ఆదేశించింది.
గణతంత్ర దినోత్సవాల నిర్వహణపై రాష్ట్రాలకు ఈనెల 19న కేంద్రం జారీచేసిన అన్ని మార్గదర్శకాలు పాటించాలని తెలిపింది. రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమలులో లేనప్పుడు రిపబ్లిక్ డే వేడుకలు జరపడానికి అభ్యంతరమేంటని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ను ప్రశ్నించింది. రిపబ్లిక్ డే జాతీయ పండుగ అని, దేశభక్తిని చాటిచెప్పే సందర్భమని పేర్కొన్న ఉన్నత న్యాయస్థానం గణతంత్ర స్ఫూర్తిని చాటేలా వేడుకలు నిర్వహించాలని స్ఫష్టం చేసింది. ఇక వేడుకలతో పాటు పరేడ్ కూడా నిర్వహించాలని, దీనికి ప్రజలను అనుమతించాలని హైకోర్టు సూచించింది. మరోవైపు రాష్ట్ర గవర్నర్ తమిళిసై తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించడం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE