హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం సాయంత్రం ఎల్బీనగర్ కుడివైపు ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో (ఎస్ఆర్డీపీ) భాగంగా జీహెచ్ఎంసీ ఈ ఫ్లైఓవర్ ను నిర్మించింది. వనస్థలిపురం-దిల్సుఖ్నగర్ మార్గంలో ఎల్బీనగర్ కూడలి వద్ద ఈ ఫ్లైఓవర్ నిర్మించబడింది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలకు/హయత్నగర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా (సిగ్నల్ ఫ్రీ) వెళ్లొచ్చు. 760 మీ పొడవు, 12మీ వెడల్పుతో 3-లేన్ తో కూడిన ఈ ఫ్లై ఓవర్ ను రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఎల్బీనగర్ చౌరస్తాకు తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ఎస్ఆర్డీపీ కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలో మొత్తం 12 పనులను రూ. 650 కోట్లతో చేపట్టామని చెప్పారు. ఎల్బీనగర్ పరిధిలో ఈ ఫ్లైఓవర్ 9వ ప్రాజెక్టు అని, ఇంకా మూడు ప్రాజెక్టులు మిగిలి ఉన్నాయన్నారు. బైరామల్గూడలో సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్, రెండు లూప్లను సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈరోజు ప్రారంభించుకున్న ఫ్లైఓవర్కు మాల్ మైసమ్మ అని నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE