పదోతరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు లేకుండానే పదోతరగతి చదివిన విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అస్సేస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడులను కేటాయించి ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 5,34,903 లక్షల మంది విద్యార్థులు ప్రమోట్ అయ్యారు. మరోవైపు డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు సంబంధించి కూడా రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితుల అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముందుగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి సీఎం కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని సమస్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి, పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu