విజయవాడ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి వెళ్లే భక్తులకు శుభవార్త. విజయవాడ నుంచి షిర్డీకి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ. తద్వారా ఇకపై షిర్డీకి తక్కువ సమయంలో వెళ్లే అవకాశం కల్పించింది. కాగా విజయవాడ నుంచి షిర్డీకి ప్రతిరోజూ ప్రత్యేక విమాన సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ఆదివారం(మార్చి 26) తొలి సర్వీసును ఇండిగో ప్రారంభించింది. నిన్న 70 మంది ప్రయాణీకులతో ఏటిఆర్72-600 విమానం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి విజయవాడ విమానాశ్రయం చేరుకుంది. అక్కడినుంచి మధ్యాహ్నం 12:25 గంటలకు షిర్డీకి పయనమైంది.
అలాగే అటువైపు షిర్డీ నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు ఒక విమానం బయలుదేరి సాయంత్రం 4:26 గంటలకు విజయవాడకు మరో సర్వీసు కూడా ప్రారంభమైంది. దీనిద్వారా 65మంది విజయవాడ చేరుకున్నారు. గన్నవరం నుండి షిరిడీకి ప్రారంభ టికెట్ ధర రూ.4,246 కాగా.. షిర్డీ నుండి రిటర్న్ టికెట్ ధర రూ.4,639గా నిర్ణయించారు. కాగా ఇప్పటివరకు విజయవాడ నుండి షిర్డీ వెళ్లాలంటే రోడ్డు మార్గమో లేదంటే ట్రైన్లోనో ప్రయాణం చేయాల్సి వచ్చేది. అదికూడా దాదాపు ట్రైన్లో 20 గంటల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ విమానంలో వెళ్లాలంటే.. ముందుగా హైదరాబాద్ వెళ్లి, అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కాలి. అయితే ఇకపై ఈ అవస్థలు ఉండవు. దీనిద్వారా కేవలం 2 గంటల 50 నిముషాల్లో విజయవాడ నుంచి షిర్డీ చేరుకోవచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE