ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో నేడు (గురువారం, మే 25, 2023) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. నూతనంగా నిర్మించిన డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలోని ఆరవ అంతస్థులో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవనుంది. కాగా ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు. అలాగే 9వ విడత తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇళ్ల పట్టాల పంపిణీ తదితర కార్యక్రమాలపై కూడా సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా అన్ని శాఖల మంత్రులతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ను కూడా ఆహ్వానించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సచివాలయం ప్రారంభమైన తర్వాత సీఎం కేసీఆర్ కలెక్టర్లతో నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే కావడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE