తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని లక్షలాది మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈరోజు (గురువారం, మే 25, 2023) విడుదలయ్యాయి. హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ వద్ద గల జేఎన్ ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, ఎంసెట్ ఛైర్మన్ కట్టా నర్సింహా రెడ్డి, కన్వీనర్ డీన్కుమార్, కో కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్, ఫార్మా మరియు అగ్రికల్చర్ కోర్సుల ఫలితాలకు సంబంధించిన ర్యాంకులు మరియు మార్కులను మంత్రి విడుదల చేశారు.
కాగా పరీక్షలకు హాజరైన విద్యార్ధులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ eamcet.tsche.ac.inలో చెక్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కాగా ఇంజినీరింగ్లో 80%, ఫార్మా, అగ్రికల్చర్లో 86% మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి ప్రకటించారు. ఇక ఇంజినీరింగ్ పరీక్షలో 79% అబ్బాయిలు, 85% మంది అమ్మాయిలు క్వాలిఫై అయ్యారని, అలాగే అగ్రికల్చర్ పరీక్షలో 84% అబ్బాయిలు, 87% అమ్మాయిలు క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ రెండింటిలో ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు టాప్ ర్యాంకులు దక్కించుకోవడం విశేషం. అందులోనూ ఫార్మా మరియు అగ్రికల్చర్ విభాగాల్లో ఏపీ విద్యార్థులు టాప్ 5లో ఏకంగా 4 ర్యాంకులు దక్కించుకోవడం గమనార్హం.
కాగా ఈ పరీక్షల్లో తెలంగాణలో 96.35%, ఆంధ్రప్రదేశ్లో 92.50% హాజరు నమోదైంది. హైదరాబాద్లో 97% మంది విద్యార్థులు టీఎస్ ఎంసెట్ పరీక్ష రాశారు. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలు 12, 13, 14 తేదీల్లో జరిగాయి. అగ్రికల్చర్ ప్రిలిమినరీ కీ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కీపై అభ్యంతరాలు అనుమతించబడతాయని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఇంజనీరింగ్ ప్రిలిమినరీ కీని ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. ఇక ఈ ఏడాది మొత్తం 3,20,683 మంది విద్యార్థులు ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, 3,01,789 మంది పరీక్షకు హాజరయ్యారు. 94.11% మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ పరీక్షలను 1,95,275 మంది రాయగా.. అగ్రికల్చర్ పరీక్షలకు 1,06,514 మంది హాజరయ్యారు.
తెలంగాణ ఎంసెట్ ర్యాంకులు సాధించిన టాపర్స్ వీరే..
ఇంజనీరింగ్ విభాగంలో
- 1. సనపల్ల అనిరుధ్
- 2. యాకంటి మణిందర్ రెడ్డి
- 3. చల్ల ఉమేష్ వరుణ్
- 4. అభినిత్ మంజేటి
- 5. పన్నతోట ప్రమోద్ కుమార్ రెడ్డి
అగ్రికల్చరల్ అండ్ ఫార్మా విభాగంలో
- 1. బూరుగుపల్లి సత్య ఫస్ట్ ర్యాంక్
- 2. నాసిక వెంకట తేజ
- 3. పసుపులేటి లక్ష్మి
- 4. దుర్గంపూడి కార్తికేయ రెడ్డి
- 5. బుర్రా వరుణ్ తేజ
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE