టీఎస్ ఎంసెట్‌ ఫలితాలు విడుదల.. ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Telangana Education Minister Sabitha Indra Reddy Released The TS EAMCET 2023 Results,Telangana Education Minister Sabitha Indra Reddy,Sabitha Indra Reddy Released The TS EAMCET Results,TS EAMCET 2023 Results Released,Telangana Education Minister Released EAMCET Results,Mango News,Mango News Telugu,Telangana Education Minister,Minister Sabitha Indra Reddy,TS EAMCET 2023,TS EAMCET 2023 Results,TS EAMCET Latest News,TS EAMCET Latest Updates,TS EAMCET Live News,Minister Sabitha Indra Reddy Latest News,TS EAMCET 2023 Results Latest News,TS EAMCET 2023 Results Live Updates

తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని లక్షలాది మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్‌-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈరోజు (గురువారం, మే 25, 2023) విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ వద్ద గల జేఎన్ ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి, ఎంసెట్‌ ఛైర్మన్‌ కట్టా నర్సింహా రెడ్డి, కన్వీనర్‌ డీన్‌కుమార్‌, కో కన్వీనర్‌ విజయకుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్, ఫార్మా మరియు అగ్రికల్చర్ కోర్సుల ఫలితాలకు సంబంధించిన ర్యాంకులు మరియు మార్కులను మంత్రి విడుదల చేశారు.

కాగా పరీక్షలకు హాజరైన విద్యార్ధులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.inలో చెక్‌ చేసుకోవచ్చని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కాగా ఇంజినీరింగ్‌లో 80%, ఫార్మా,  అగ్రికల్చర్‌లో 86% మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి ప్రకటించారు. ఇక ఇంజినీరింగ్‌ పరీక్షలో 79% అబ్బాయిలు, 85% మంది అమ్మాయిలు క్వాలిఫై అయ్యారని, అలాగే అగ్రికల్చర్‌ పరీక్షలో 84% అబ్బాయిలు, 87% అమ్మాయిలు క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ రెండింటిలో ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు టాప్ ర్యాంకులు దక్కించుకోవడం విశేషం. అందులోనూ ఫార్మా మరియు అగ్రికల్చర్ విభాగాల్లో ఏపీ విద్యార్థులు టాప్ 5లో ఏకంగా 4 ర్యాంకులు దక్కించుకోవడం గమనార్హం.

కాగా ఈ పరీక్షల్లో తెలంగాణలో 96.35%, ఆంధ్రప్రదేశ్‌లో 92.50% హాజరు నమోదైంది. హైదరాబాద్‌లో 97% మంది విద్యార్థులు టీఎస్ ఎంసెట్‌ పరీక్ష రాశారు. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలు 12, 13, 14 తేదీల్లో జరిగాయి. అగ్రికల్చర్ ప్రిలిమినరీ కీ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కీపై అభ్యంతరాలు అనుమతించబడతాయని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఇంజనీరింగ్ ప్రిలిమినరీ కీని ఎంసెట్‌ కన్వీనర్ ప్రకటించారు. ఇక ఈ ఏడాది మొత్తం 3,20,683 మంది విద్యార్థులు ఎంసెట్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, 3,01,789 మంది పరీక్షకు హాజరయ్యారు. 94.11% మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ పరీక్షలను 1,95,275 మంది రాయగా.. అగ్రికల్చర్ పరీక్షలకు 1,06,514 మంది హాజరయ్యారు.

తెలంగాణ ఎంసెట్ ర్యాంకులు సాధించిన టాపర్స్ వీరే..

ఇంజనీరింగ్ విభాగంలో

  • 1. సనపల్ల అనిరుధ్
  • 2. యాకంటి మణిందర్‌ రెడ్డి
  • 3. చల్ల ఉమేష్ వరుణ్
  • 4. అభినిత్ మంజేటి
  • 5. పన్నతోట ప్రమోద్ కుమార్ రెడ్డి

అగ్రికల్చరల్ అండ్ ఫార్మా విభాగంలో

  • 1. బూరుగుపల్లి సత్య ఫస్ట్ ర్యాంక్
  • 2. నాసిక వెంకట తేజ
  • 3. పసుపులేటి లక్ష్మి
  • 4. దుర్గంపూడి కార్తికేయ రెడ్డి
  • 5. బుర్రా వరుణ్ తేజ

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 18 =