దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకి పెరుగుతుండడంతో మే 3 వ తేదీవరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉన్న హాట్స్పాట్ జిల్లాల జాబితాను ఏప్రిల్ 15, బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 170 జిల్లాలను హాట్స్పాట్ కేంద్రాలుగా ప్రకటించింది. అలాగే 207 జిల్లాలను నాన్ హాట్స్పాట్ జిల్లాలుగానూ, మిగిలినవి గ్రీన్జోన్లోనూ ఉన్నట్లు పేర్కొన్నారు. హాట్ స్పాట్ జిల్లాలతో పాటు కంటైన్మెంట్ ప్రదేశాల వివరాలను కేంద్రం అన్ని రాష్ట్రాలకు పంపింది.
లాక్డౌన్ ను మరికొంతకాలం కాలం పొడిగించడంతో కరోనా వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 19 జిల్లాలను కరోనా హాట్స్పాట్ ప్రాంతాలుగా గుర్తించారు. తెలంగాణలో 8 జిల్లాలను, ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా 11 జిల్లాలను హాట్స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది.
తెలంగాణలో హాట్స్పాట్ జిల్లాలు:
- హైదరాబాద్
- నిజామాబాద్
- వరంగల్
- రంగారెడ్డి
- జోగులాంబ గద్వాల
- మేడ్చల్ మల్కాజిగిరి
- కరీంనగర్
- నిర్మల్
ఏపీలో హాట్స్పాట్ జిల్లాలు:
- విశాఖపట్నం
- తూర్పుగోదావరి
- పశ్చిమగోదావరి
- కృష్ణా
- గుంటూరు
- ప్రకాశం
- నెల్లూరు
- కడప
- కర్నూలు
- అనంతపురం
- చిత్తూరు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]