ప్రముఖ సినీనటుడు, తమిళ స్టార్ విజయ్ కరోనాపై పోరుకు రూ.1.30 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటుగా వివిధ రాష్ట్రాల సీఎంల రిలీఫ్ ఫండ్లకు అందిస్తున్నట్టు ప్రకటించారు. రూ.1.30 కోట్ల మొత్తంలో తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు ప్రకటించారు.
అలాగే పీఎం-కేర్స్ పండ్స్ కు రూ.25 లక్షలు, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (పెప్సీ) నిధికి రూ.25 లక్షలు, కేరళ సీఎం సహాయ నిధికి రూ.10 లక్షలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల సీఎంల సహాయ నిధులకు చెరో రూ.5 లక్షల విరాళాన్ని విజయ్ ప్రకటించారు.
[subscribe]
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu