ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి దంపతులపై ఏప్రిల్ 22, బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. స్టూడియో నుంచి విధులు ముగించుకుని తన సతీమణితో కలిసి కారులో ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. తనపై జరిగిన దాడికి సంబంధించి ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా అర్నాబ్ పేర్కొన్నాడు. ఈ దాడిలో అర్నాబ్ దంపతులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఓ వీడియో విడుదల చేసి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అర్నాబ్ వెల్లడించారు.
అర్నాబ్ విడుదల చేసిన వీడియోలో తనపై దాడికి పాల్పడిన ఇద్దరూ యూత్ కాంగ్రెస్ నాయకులేనని ఆయన ఆరోపించారు. స్టూడియో నుంచి తిరిగివస్తున్న రాత్రి 12.15 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని చెప్పారు. బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ముందుగా కారు అద్దాలు పగలకొట్టడానికి ప్రయత్నించారని, అనంతరం ద్రావణం కలిగిన బాటిల్స్ విసిరారని తెలిపారు. తనకు ఏదైనా జరిగితే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, వాద్రా కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అర్నాబ్ అన్నారు. ఏప్రిల్ 16న ముంబైలోని పాల్గర్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురైన ఉదంతానికి సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అర్నాబ్ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే అర్నాబ్ పై దాడి ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.
#BREAKING | Arnab’s message after being physically attacked by Congress goons #SoniaGoonsAttackArnab https://t.co/RZHKU3fdmK pic.twitter.com/SdAvoerhIH
— Republic (@republic) April 22, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]