ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 : 15 మందితో కూడిన భారత జట్టు ఎంపిక

BCCI Announced India Women’s Squad for ICC Women’s World Cup, BCCI Announced India Women’s Squad for ICC Women’s World Cup 2022, BCCI announces Indian team, BCCI announces squad for ICC Women’s, BCCI Live Updates, BCCI Updates, Cricket Live Updates, cricket news, cricket updates, ICC Womens World Cup, ICC Womens World Cup 2022, ICC Womens World Cup Live Updates, ICC Womens World Cup Updates, India squad for New Zealand tour, India Women Squad For World Cup, Mango News, Mango News Telugu, New Zealand tour Live Updates, The Board of Control for Cricket in India, Women’s Indian squad, Women’s Indian squad Updates, World Cup 2022 Live Updates, World Cup 2022 News, World Cup 2022 Updates

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 న్యూజిలాండ్ లో మార్చి 4, 2022 నుండి ఏప్రిల్ 3, 2022 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే భారత్ జట్టును బీసీసీఐ నేతృత్వంలోని ఆల్-ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ గురువారం నాడు ఎంపిక చేసింది. మొత్తం 15 మంది సభ్యులు, ముగ్గురు స్టాండ్ బై ప్లేయర్స్ తో కూడిన భారత్ మహిళల జట్టుకు మిథాలీరాజ్‌ కెప్టెన్‌గా, హర్మన్ ఫ్రీత్ కౌర్ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. భారత్ మహిళల జట్టు తమ మొదటి ప్రపంచ కప్ మ్యాచ్‌ని మార్చి 6, 2022న బే ఓవల్, తౌరంగలో పాకిస్థాన్‌తో ఆడనుంది. అలాగే ఫిబ్రవరి 11, 2022 నుండి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే 5-మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కు కూడా ఇదే జట్టు ఆడనుంది.

వన్డే ప్రపంచకప్ కోసం భారత్ మహిళల జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్-కీపర్), స్నేహ రానా, ఝులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్-కీపర్), రాజేశ్వరి గయాక్వాడ్, పూనమ్ యాదవ్.

స్టాండ్‌బై ప్లేయర్స్: సబ్భినేని మేఘన, ఏక్తా బిష్త్, సిమ్రాన్ దిల్ బహదూర్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 2 =