తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన హింసాకాండపై AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో హింస చెలరేగింది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరినీ అనుమతించవద్దని అన్నారు. హింసాకాండపై అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జితేంద్రతో మాట్లాడానని తెలిపారు. అదనపు బలగాలను పంపిస్తున్నామని, నిరసనకారులపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ డిజిపి హామీ ఇచ్చినట్లు ఒవైసి పేర్కొన్నారు. కాగా దేశంలో మైనారిటీలపై జరుగుతున్న హింసపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించడం తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో ముస్లిం వృద్ధుడిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ముస్లిం వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ గత వారం గిరిజన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు నిరసనగా బుధవారం బంద్కు పిలుపునిచ్చారు. 2000 మంది గుంపు ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లోని ముస్లిం వ్యక్తి ఆస్తులపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో పలు దుకాణాలకు నిప్పు అంటించారు. దీంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. సమాచారం అందుకున్న ఆసిఫాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ సంఖ్యలో నిరసనకారులు ఆ ప్రాంతంలో మోహరించడంతో స్థానిక పోలీసులకు సహాయం చేయడానికి పొరుగు మండలాలు మరియు ప్రధాన కార్యాలయాల నుండి బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆసిఫాబాద్ మరియు రాష్ట్రంలోని సీనియర్ పోలీసు అధికారులు హింసాత్మక ప్రాంతాలకు వెళుతున్నారు.