తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 162 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో డిసెంబర్ 24, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,80,413 కి చేరింది. కరోనా వలన మరొకరు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,019కి పెరిగింది. అలాగే మరో 210 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి 6,72,847 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 81, రంగారెడ్డిలో 24, హనుమకొండలో 10 నమోదయ్యాయి.
మరోవైపు తెలంగాణలో ఇప్పటివరకు 38 ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నమోదయ్యాయి. కాగా వీరిలో ఇప్పటికే 10 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు. కొత్తగా రాష్ట్రంలో ఎలాంటి ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు. అయితే గత 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 883 మంది వచ్చారు. వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, ఐదుగురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా తేలినట్టు చెప్పారు. దీంతో వారి శాంపిల్స్ ను కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, మొత్తం 15 మంది ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (డిసెంబర్ 24, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,94,68,944
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 6,80,413
- కొత్తగా నమోదైన కేసులు : 162
- కొత్తగా నమోదైన మరణాలు : 1
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 6,72,847
- కరోనా రికవరీ రేటు: 98.83%
- యాక్టీవ్ కేసులు: 3,547
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,019
- కరోనా మరణాల రేటు: 0.59%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ