ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మే 29, శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2874 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 11,638 సాంపిల్స్ ని పరీక్షించగా 33 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. కోవిడ్ వలన కర్నూల్ జిల్లాలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 60 కి చేరింది.
మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు 2037 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 79 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 777 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించారు. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూర్ జిల్లాలో 4, నెల్లూరు లో 2 కలిపి మొత్తం 6 కేసులు కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చినట్టుగా పేర్కొన్నారు.
ఇక ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 345 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం 156 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా గత 24 గంటల్లో 22 మంది డిశ్చార్జ్ అయినట్టు ప్రకటించారు. మరోవైపు విదేశాల నుండి వచ్చిన వారిలో ఇప్పటికి 111 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.
#COVIDUpdates:
Total positive cases: 2874
Discharged: 2037
Deceased: 60
Active cases: 777#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/wLyk1WT6Jv— ArogyaAndhra (@ArogyaAndhra) May 29, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu