ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 12 జిల్లాల్లోని 2,724 పంచాయతీలు, 20,157 వార్డులకు ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. కాగా మొదటివిడత పంచాయతీ ఎన్నికల్లో 81.78% పోలింగ్ నమోదయినట్టు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరగడం పట్ల అధికారులు, ఎన్నికల సిబ్బందికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 85.06 శాతం పోలింగ్ నమోదు కాగా, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 75.41 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాలవారీగా పోలింగ్ శాతం వివరాలు:
- తూర్పుగోదావరి: 82.80
- పశ్చిమగోదావరి: 80.29
- కృష్ణా: 85.06
- గుంటూరు: 83.04
- ప్రకాశం: 80.89
- నెల్లూరు: 80.62
- శ్రీకాకుళం:77.04
- విశాఖపట్నం: 82.86
- చిత్తూరు జిల్లా: 83.47
- అనంతపురం: 82.30
- కడప: 78
- కర్నూలు: 83.55
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ