వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26 న ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఎర్రకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎర్రకోట వద్ద జరిగిన హింస, విధ్వంస ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్ సిద్దూ ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులకు చిక్కాడు. ఆయన్ను సోమవారం రాత్రి అరెస్టు చేసినట్లుగా ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అనంతరం దీప్ సిద్దూను ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచగా, ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ముందుగా ఎర్రకోట ఘటన అనంతరం నటుడు దీప్ సిద్దూ అజ్ఞాతంలోకి వెళ్ళాడు. జరిగిన హింసపై దర్యాప్తు అనంతరం దీప్ సిద్దూ పాత్ర ఉందంటూ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటినుంచి దీప్ సిద్దూ సహా మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారి ఆచూకీ తెలిపిన వారికీ రూ.లక్ష రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు. ఈ క్రమంలో జిరాక్పుర్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం దీప్ సిద్దూను అరెస్టు చేసి, అదుపులోకి తీసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ