భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలిటెస్టులో ఇంగ్లాండ్ జట్టు 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ 1-0 తో ఆధిక్యంలో నిలిచింది. 39/1 వద్ద ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు 192 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇంగ్లాండ్ నిర్దేశించిన 420 పరుగుల లక్ష్య సాధనలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన భారత్ జట్టు పరాజయం పాలయింది. ఇంగ్లాండ్ బౌలర్లు జాక్ లీచ్ 4, అండర్సన్ 3 వికెట్లుతో రాణించడంతో భారత్ కు డ్రా చేసుకునే అవకాశం కూడా లేకపోయింది. భారత్ బ్యాట్స్మెన్ లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(72), శుభ్మన్గిల్(50) మాత్రమే రాణించారు. ఇక రెండో టెస్టు ఫిబ్రవరి 13 నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియంలోనే జరగనుంది.
భారత్–ఇంగ్లాండ్ తోలి టెస్టు వివరాలు:
ఇంగ్లాండ్ తోలి ఇన్నింగ్స్: 578-10
- జో రూట్ (218), డొమినిక్ సిబ్లీ (87), బెన్ స్టోక్స్ (82)
- అశ్విన్ 3/146, బుమ్రా 3/84
భారత్ తోలి ఇన్నింగ్స్: 337-10
- రిషబ్ పంత్ (91), వాషింగ్టన్ సుందర్ (85), పుజారా (73)
- డోమ్ బెస్ 4/76, అండర్సన్ 2/46
ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్: 178-10
- జో రూట్ (40), ఓలి పోప్ (28)
- అశ్విన్ 6/61, నదీమ్ 2/66
భారత్ రెండవ ఇన్నింగ్స్: 192-10
- విరాట్ కోహ్లీ(72), శుభ్మన్గిల్(50)
- జాక్ లీచ్ 4/76, అండర్సన్ 3/17
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ