ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును 28వ తేదీనే విచారిస్తామని న్యాయమూర్తి కెఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం, 28వ తేదీ కన్నా ముందే కేసు విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు చేసిన విజ్ణప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఇందులో రాజ్యాంగ పరమైన అంశాలు అనేకం అపరిష్కృతంగా ఉన్నాయని, హడావిడిగా నిర్ణయం తీసుకోవడం కుదరదని న్యాయమూర్తి కెఎం జోసెఫ్ పేర్కొన్నారు. అయితే ఈ కేసులో విచారణకు 28వ తేదీ ఒక్క రోజే సరిపోదని, బుధ, గురువారాల్లో కూడా విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం బదులిస్తూ.. బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని సీజేఐ సర్క్కులర్ ఉందని గుర్తు చేసింది. దీంతో సీజేఐ ధర్మాసనం ముందు దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరగా.. అనుమతి ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE